హైదరాబాద్ నుమాయిష్ : కొత్త ఆలోచనలే చరిత్రను సృష్టిస్తుంటాయి.

నుమాయిష్ చరిత్రను నిక్షిప్తం చేసుకున్న పోస్టల్ స్టాంపు
నుమాయిష్ మస్నాత్ – - ముల్కీ లేదా నుమాయిష్ అనే మాటను ప్రదర్శన ఇంకా చెప్పాలంటే సంత అనే అర్ధం. 46 రోజుల కాలం పాటు ప్రతి ఏటా క్రమంతప్పకుండా జనవరి మొదటి తేదీ నుంచి పిబ్రవరి 15 వ తారీఖు వరకూ ఎడతెరపి లేకుండా నిర్ధేశిత నాంపల్లి లోని  అతి పెద్ద స్థలం ( 23 ఎకరాలు లేదా 93 వేల చదరపు మీటర్లు) లో నిర్వహించే ఈ సంత ప్రపంచంలో నిర్వహించే మరే ఇతర ప్రదర్శనలకన్నా ప్రాచీన మైనదే కాదు. ప్రత్యేకమైనది కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఇటువంటిది మరొకటి లేదు.

The Nizam of Hyderabad, arriving at Exhibition to inaugurate the Numaish-e-Masnuath-e-Mulki



Down memory lane:The seventh Nizam, Mir Osman Ali Khan, along with members of the royal family and staff at the first inaugural function of ‘Numaish' on February 22, 1940.


Seventh Nizam Mir Osman Ali Khan at Numaish Masnuat-e-Mulki, 1944, at Public Gardens


Mir Osman Ali Khan and Nawab Zainyar Jung at Numaish, 1946


C. Rajagopalachari, Governor General of India, at the All India Industrial Exhibition in 1949



Dr.Sarvepally . Radha Krishnan visiting AIIE in 1952.


Sri B.Ramakrishna Rao,Cheif Minister visiting Art gallery in Exhibition in 1955




Shri Balram Jhaker, Loka Sabha Speaker,inaugurating the 45 AIIE.Seen with him are Sri N.T.Rama Rao,Chief Minister,Sri G.Narayan Rao,President Exhibition Society,Sri Mohd.Mohiuddin Jeelani and Sri Ranjit Singh


1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ లోని ఎకనమిక్ కమిటీలో వున్న యువకులకు  వచ్చిన ఆలోచన ఇది. ప్రాంతీయంగా తయారయ్యే, అమ్ముడయ్యే వివిధ ఉత్పత్తులను కొన్ని రోజులపాటు పల్లెల్లో జరిగే సంతలాగా కొన్ని రోజుల పాటు ప్రదర్శనకు వుంచితే వినియోగదారులకు వివిధ రకాల ఉత్పత్తులు అందుబాటులోకి రావడంతో పాటు, విక్రేతలకు సాధారణంకంటే అధికంగా అమ్ముడయ్యే అవకాశం వుంటుందని అనుకున్నారు. అంతే కాకుండా ఈ ప్రదర్శన ద్వారా లభించిన మొత్తం తో రాష్ట్ర ఆర్ధిక సర్వే చేసే అవకాశం వుంటుంది అనే విషయాన్ని హైదరాబాద్ సంస్థాన ప్రధానమంత్రి అక్భర్ హైదరీ ముందు వుంచారు.  ఆయనకు ఇది బాగానే వుందనిపించింది. 1938 లో మీర్ ఉస్మాన్ గారి పుట్టిన రోజు కలిసి వచ్చేలా దీన్ని వారి చేతుల మీదుగానే పబ్లిక్ గార్డెన్ లో  ప్రారంభించారు.  వారి ఆలోచన నిజంగానే ఫలించింది. వినియోగదారులు, విక్రేతలకు లాభదాయకంగా వుండటం మాత్రమే కాకుండా అదొక ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చే సంబరంగా మారింది. పిల్లలతో తరలి వచ్చి అన్ని రకాల దుకాణాలనూ చూడటాన్ని జనం ఇష్టపడ్డారు.


దీని ప్రాచుర్యానికి తగినంత స్థలం చాలటం లేదని 1946 లో అప్పటి ప్రధాని సర్ మీర్జా ఇస్మాయిల్ ఈ ప్రదర్శనను ఇప్పడు ప్రదర్శన జరుగుతున్న విశాలమైన ప్రదేశంలోకి మార్చారు. ప్రదేశం విశాలంగా వుండటం ఒక్కటే కాకుండా రైల్వే స్టేషన్ కు కూడా దగ్గరగా వుండటం అనే అంశాన్ని దృష్టిలో వుంచుకున్నారని ప్రముఖ చరిత్ర కారులు M.A ఖయ్యామ్ అభిప్రాయపడ్డారు. అప్పటి నుండి క్రమంతప్పకుండా  అదే చోటులో జరుగుతోంది.. అది నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం గానే పేరు పొందింది. కొన్నాళ్ళ పాటు నుమాయిష్ ను అఖిల భారత ఇండస్ట్రియల్ ప్రదర్శనగా పిలిచినా మళ్ళీ 2009 నుంచి ప్రదర్శనకు చారిత్రక మూలాలున్న నుమాయిష్ పేరునే వాడుతున్నారు. పేరుకి అఖిల భారత అంటున్నప్పటికీ నిజానికి అంతకంటే ఎక్కువగానే దేశం బయటి వస్తువులు కూడా ప్రదర్శనకు వస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ నుంచి హ్యండీక్రాఫ్ట్, వస్తాయి ఇరాన్ నుంచి ప్రత్యేకమైన కార్పెట్లు ఇక్కడ అమ్మకానికి పెడతారు. అలాగే టర్కీ, బంగ్లాదేశ్ లనుంచి కూడా వస్తువులను ప్రదర్శనకు వుంచుతారు. 2011 లో కొన్ని ప్రత్యేక కారణాల వల్ల అనుమతిని నిరాకరించేంత వరకు పాకిస్థాన్ సైతం ఇక్కడ తన స్టాల్ లో వారి దేశం వస్తువులను అమ్మకానికి వుంచేది.  ఇది దొరుకుతుంది ఇది దొరకదు అని లేకుండా చెప్పుల నుండి క్లిప్పుల దాకా ప్రతి ఒక్కటి రకరకాల స్టాళ్ళలో వుంటాయి. దీనికి అదనంగా చవులూరించే వంటకాలూ, పిల్లల సరదా తీర్చే ఆటవస్తువులూ జయింట్ వీల్స్. పనిలో పనిగా వివిధ శాఖల ఎవేర్ నెస్ స్టాల్స్ 2600 స్టాల్స్ పైగా ఏర్పాటు చేస్తున్నారు. 25 లక్షల మందికి పైగా సందర్శిస్తున్నారు.  కోట్లాది రూపాయిల  వ్యాపారం జరుగుతోంది.



1956 లో ఈ ప్రదర్శనను కంపెనీల చట్టం ప్రకారం లాభాపేక్షలేని సంస్థగా రిజిస్టర్ కూడా చేసించారు. ఇంత పెద్ద ఆవరణలోకి మూడు గేట్ల ద్వారా ప్రవేశించ వచ్చు గాంధిభవన్ గేటుగా చెప్పేది ఒకటవ గేటు. రెండవది అజంతా గేటు, మూడవది గోషామహల్ గేటు. వీటిలో ప్రధానమైనది పెద్దది అజంతా గేటు దీన్నే ప్రధాన ద్వారంగా భావిస్తారు. 
2012 లో నుమాయిష్ స్థల వినియోగ చిత్రం

ఇక్కడ ప్రధాన మైన సమస్య పార్కింగ్ లక్షలాధిగా తరలి వచ్చే వాహనాలకు ప్రభుత్వం వైపునుంచి సరైన పార్కింగ్ సౌకర్యం కలిగించటం లేదని ప్రతిసంవత్సరం విమర్శలు వస్తునే వున్నాయి. వాహనాలు దూరంగా పార్క్ చేయాల్సి రావడం, సరైన రక్షణ లేకపోవడంతో పాటు నిర్ధేశించిన మొత్తాలకంటే చాలా ఎక్కువగా చెల్లించి మరీ పార్క్ చేయాల్సి వస్తోందని సందర్శకుల నుండి ప్రతిసంవత్సరం వస్తున్న పిర్యాదుల రీత్యా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేయాల్సిన అవసరం వుంది.







మరిన్ని హైదరాబాద్ చారిత్రక వివరాల కోసం హైదరాబాద్ చరిత్ర ఫేస్ బుక్ గ్రూప్ చూడండి.

https://www.facebook.com/groups/HistoryofHyderabad/
https://www.facebook.com/groups/238273006348271/

కామెంట్‌లు