"స్ఠిమితత్వమే కట్టా శ్రీనివాస్ కవిత్వతత్వం" ~ రాజారామ్.టి

Mattivellu
COVER PAGE
" నేనొక నదిని
ప్రవహించే వరదని
ఫృధివి జీవన హృదిని
నిరంతరానువర్తన ఆవృతిని"

ని తన్ను తాను పరిచయం చేసుకొటున్న కవి కట్టా శ్రీనివాస్."పాకే పురుగులాంటి జీవితం చుట్టూ, పొరలుపొరలుగా పేరుకుపోయిన ఉదాశేనపు గూడు,బద్దకంగా నిద్రపోయే లోపటిపొరల్లొంచి,నవ్వూ,ఏడుపూ ఏదీ స్వచ్ఛంగా బయటికి రాదు,జీవం రావాలంటే మళ్ళీ బాల్యంలోకో,గూళ్ళన్నీ బద్దలు కొట్టుకొంటూ భవిష్యత్తులోకో దూకాలి"-అనే జీవిత తాత్విక రహస్యాన్నీ చెప్పినవాడు కట్టా శ్రీనివాస్. "ఒక అర్థరాత్రి/నా కవితల్నీ నేనే చదువుకుంటూ/నా డైరీనీ నేనే పరిశీలిస్తూ అపరిపక్వతకు నవ్వుకుంటాను."-అని కవిత్వపు లోతునూ అర్థమయ్యేటట్లుగా వ్యాఖ్యానం చేసిన కవి శ్రీనివాస్.

‘నాకో గమనింపు వుంది./వేళ్ళేప్పుడూ నేలలోనే వుండాలని/ఆధారమే కాదు,ఆహారమూ అక్కడిదేనని/నేల విడిచిన సాముకి నిలకడేమీ మిగలదని./మట్టి వేళ్ళు నాకెపుడూ చెబుతూనే వుంటాయి."-అని అనుకొంటూ వొక తాత్విక రహస్యాన్ని విప్పి చెప్పిన కవి శ్రీనివాస్.

"మిత్రపొత్తం' తెరచి "వెంటాడే బాల్యం" లోని ‘‘నవ్వే సీతకోక చిలుకలతోట"ను ఙ్ఞాపకానికి తెచ్చుకొని "నవ్వే నక్షత్రాలు" ఎన్నున్నాయో లెక్కిస్తూ, ఈ జన సమూహం ఈనాడొక "ద్వీప స్వమూహం" అని భావించుకొంటూ...'కాలం చెల్లిన పాటలు" పాడకుండా "నేనెలా మారాలి" అనే "ప్రశ్నోపనిషత్తు"ను ఎదుర్కొంటూ"వర్షం వెలిశాక' ఓటమి నుంచి పాఠం" నేర్చుకోవడానికీ 'ఇంకో ప్రయత్నం" చేస్తున్న స్థిమితత్వం కలిగిన మంచి కవి కట్టా శ్రీనివాస్.

"పుట్టలోని చెదలు" పుట్టొచ్చు గిట్టొచ్చు కానీ శ్రీనివాస్ కవిత్వం అనందాన్ని పుట్టిస్తుంది.ఈకవిత్వం పై "నెగెటివ్ వాయిస్"అసలు వినిపించదు."మరోసారి" "ప్రయాస"పడి చదివితే ఈ కవిత్వపు "అంచులపై హర్మ్యాలపై"నిలబడితే ఒక అద్భుత అనుభూతితో పాటూ,ఒకఆలోచన"Xగ్రేసియో"గాపొందొచ్చు.కవుల"గుంపులో అతడొక చూపుడు వేలు".అందుకేఅఫ్సర్ ఈ కవిని "వాస్తవికతని ఎలాంటి ముసుగులు లేకుండా వాస్తవికతగా చూసే దృష్టి గల స్థిమితత్వ కవిగా ఆలోచన చేశారు.చాల నెలలుగా శ్రీనివాస్ కవిత్వాన్ని చదువుతూ,రాయాలని ప్రయత్నించి విఫలమయి చివరకు ఈ కవిత్వంపై "పండిత చర్చ' చేయడంకన్నా ఇది హృదిలో కురిపించే అనుభూతి "చిరుజల్లు'ను పరిచయం చేయాలనుకున్నా. 

ప్రపంచీకరణ కారణంగా మనిషి యాంత్రికమవ్వటమే కాదు వ్యాపారమయ్యాడు.అందుకే అతడు వొంటరి అయ్యాడు.పైగా సమూహంలో కూడా వొంటరయ్యాడు.కాబట్టే కట్టా శ్రీనివాస్ మనిషిని' "ద్వీప సమూహం"అని అంటాడు.ద్వీపకల్పమైతే వొకవైపన్నా నేల స్పర్శ వుంటుంది.ద్వీప సమూహం అయినప్పుడు అన్ని వైపుల వ్యాపార సంబంధాల తడే.అది దుఃఖపు తడి కాదు శూన్యపు,ఏకాంతపు,వొంటరితనపు తడి.అందుకేనేమో కవి "నిన్ను నీవు ఆవిష్కరించుకోకుంటే/ ప్రపంచం తన నిశ్శబ్దంలో బహిష్కరిస్తుంది.ఎందుకంటే అసలే నీవొక దీవివి'అని మనిషికి హెచ్చరికను చేస్తాడు."నలుగురిలో జతపడాలంటే పిల్లోడా మాటల వంతెన వాడాల్సిందేరా బుల్లోడా"-అని మనిషికీ,మనిషికి మధ్య మాటల వంతెన ఏర్పడాలని కవి కోరుకొంటాడు.తన కాలపు సినిమాలను వాచ్యం చేస్తూమనిషితనాన్నిపరోక్షఆవిష్కరణచేస్తాడు.మగధీర,చంద్రముఖి,సుడిగాడు,అపరిచితుడుమునగుచిత్రాలనుసమాజంలోని మనిషి పరంగా వ్యాఖ్యానిస్తాడు.అపరిచితుడు సినిమా లో హీరో రామంగా,రెమో గా,అపరిచితవ్యక్తిగావిడి విడి వేళ్ళలా ఒంటరిగా పొరాడితే ఏ ఫలితం వుండదు అని చెబుతూ,"వేళ్ళైనా విడి విడిగావదలకు/మడిచిపడితేనే/పిడికిలౌతుంది"అనితళుకులీనే వాక్యాల్లో చెబుతాడు.

తన కవిత్వంలో శ్రీనివాస్ ఏ సందర్భంలోనైనా దేన్ని గురించి మాట్లాడిన తనను గురించి,మనిషి గురించి స్పృశించకుండా వుండడు."మట్టివేళ్ళు"-అనే కవితలో "విశాల బాహువులను చాపుకుంటూ ఆకాశంలోకి ఎదిగిన చెట్టు గురించి మాట్లాడుతూ మనిషి ఎంత ఎత్తు ఎదిగినా తనకు ఆధారమైన తాను నిలబడ్డ నేలను మరువరాదనే విషయాన్ని ,మనిషి ఎంత ఎత్తు ఎదిగినా తాను నిలబడ్డ నేలను విస్మరించారదనే దాన్ని చెబుతూ వేళ్ళు తనకు ఆధారాన్ని'ఆహారాన్ని అందించేవని గుర్తుకూ తెచ్చుకొంటూ,మనిషి కూడా నేల విడిచి సాము చేయ రాదని వొక జీవన వాస్తవాన్ని విప్పి చెబుతాడు.చాల మంది కవులు కళ్ళను వొక అలంకారంగా భాసింప చేయాలనుకున్నప్పుడు వాటిని తామర పూలతోనో,పద్మ దళంగానో పోలుస్తుంటారు.కానీ శ్రీనివాస్ "చెట్టు చూసేది నలు దిశల ప్రపంచాన్ని పత్రనేత్రాలతో"--అని కళ్ళను పోలుస్తూ వొక కొత్త కవి సమయాన్ని ప్రయోగించాడు.ముఖం ఆకర్షణీయంగా వుందనటం వొక సాంప్రదాయం.దీన్నే కవి "సుకుమార ఆకర్షణ పత్రాల ముఖంలో అని అంటాడు.వొక అద్బుత సాయంత్రాన్ని కోరిక రహితంగా మనలోకి వొంపుతాడు. 

పుస్తకం తన నేస్తం.ఈ భావాన్నే "మిత్రపొత్తం" అనే కవితకు ఊపిరి చేశాడు కవి."పుస్తకాల అల్మెరా తెరిస్తే "ప్రపంచపు కిటికీ తీసినట్లే.'-ఇక పొత్తాన్ని తెరిస్తే ఓ ముద్దుల పురాతన తాత బుజ్జగింపులతో తల నిమిరినట్లే తోస్తుంది."-ఇలాంటి వాక్యాలు పుస్తకపు గొప్ప దనాన్ని,అది అందిచ్చే అనుభూతిని ఊరిస్తాయి.ప్రియమైన స్నేహితుల స్నేహం దాచిన పుస్తకమంతా కమ్మని వాసనలు వస్తాయనే కవి భావన మనల్నీ పుస్తకాలవైపు మళ్ళిస్తుంది."ఎండుతున్న మానెందుకు విలపిస్తోందని 'రాలుతున్న పండుటాకును అడుగుతాడు కవి కాలం చెల్లిన పాటలు"-అనే కవితలో.చెట్టు వలే ఆకు గూడ మరణపు అంచుల్లోనే వుండేది.కవి అడిగిన ప్రశ్నలకు ఆ ఆకు అంతరంగంలోవుండే ఆలోచనల జవాబుల్నీ కవే ఆకు తరపున కవిత్వం చేశాడు."మౌనాన్ని మరి కొంచెం అరువివ్వటమో/గతి తప్పిన ఙ్ఞాపకాల గతాన్ని/గంపలకొద్ది గుమ్మరించటమో తప్ప"-చేసేది ఏమి లేదని చెబుతూ చెట్టు బాగున్నప్పుడూ పిట్టకో పురుగుకో ఆశ్రమిచ్చి "అందరి బంధువులా సందడి"చేసిందని ఆ చెట్టుకు తన తనువే భారమైన విషాదాన్ని మోడైన తరువాత అది కోల్పోయిన చెట్టు తనాన్ని మనిషికి ఆపాదిస్తాడు శ్రీనివాస్. శ్రీనివాస్ కి అధిక్షేపంతో కూడిన వ్యంగ్యాన్నీ కవిత్వపుగా కొస మెరుపు చేయటం యిష్టంలా వుంది.నగరపు రోడ్డు మీది గుంటలు,మ్యాన్హోల్స్ మున్నగు వాటి వల్ల జరిగే ప్రమాదాల్ని చాల వ్యంగ్య చమత్కారంతో భాగవత,రామాయణ,భారతంలలోని సన్నివేశాల్ని గుర్తుకు తెస్తూ,వాటిని రూపకాలుగానో,ఉపమలుగానో చేస్తూ చెప్పిన కవిత"సమాంతర కందకాలు"."లేవండిక/మరి మొద్దు నిద్ర..!/మొసలి పట్టిన ఏనుగు కోసం/చటాలున పరిగెత్తుకొచ్చిన ఆయన/స్వంత భార్య భూమిలోకి ఇంకిపోతుంటే/చేష్టలుడిగి చూసినట్లు"-ఈ వాక్యాల్లో కవి వాడిన వ్యంగ్య వైచిత్రి నగరం నీటి మడుగై పొరలుతున్నప్పుడు ప్రమాదపు మొసళ్ళ బారిన పడిన వాళ్ళని గురించి ఆలోచించని తత్వానికి,రాజ్య నిర్లిప్తతకు చురకలంటిస్తుంది.

శ్రీనివాస్ లోని స్థిమితత్వమే కవిత్వం చేయలనుకొన్న వస్తును ఎంతో గాఢతతో హృదిలోకి బట్వాడ చేసి అందుకు తగ్గ భావనను మేధలోకి వొంపి ఆ వస్తువుకు సరిపోయే రూపంలో పఠిత మదిలో వొదిగిపోయేటట్లుగా చేస్తున్నది ఈ సంపుటిలో.రేవ్ పార్టీలలో ఊగిసలాడిపోయి ఊపిర్లు సైతం కోల్పోతున్న యువతను చూడక తప్పని వైనాన్ని,ఆ యువతకి ప్రతీకగా గాలిపటాన్ని చూపి చెప్పిన కవిత' రేవు కొచ్చిన జీవితాలు.'"భధ్రంగా పట్టుకొన్నా రెండు చేతుల కళ్ళు కప్పి కొట్టుకొచ్చినట్లుంది"అనే పంక్తుల్లో యువత ఆకాశంలో తలెత్తుకెగరాల్సిన రోజు ఇలా తెగిపడి చావు రేవులో తేలుతున్న విషయాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు ఈ కవి."అనుబంధ దారం జారిందంటే గాలివాటపు జీవితం ఏ దరి చేరదు"-అనే వొక వాస్తవాన్ని కవి బలంగా నిర్మిస్తాడు."మట్టి వేళ్ళు"-అనే ఈ సంపుటి సారం అన్ని ఖండికల్లో ప్రవహించినా అర్తవంతమైన,వేగవంతమైన సమర్త ప్రవాహం మాత్రం కొన్ని కవితల్లో ఉరికురికీ వస్తుంది.
గమనం ఎప్పుడూ కాలానికీ అతీతమే.పదార్థం ఎప్పుడూ నశించదు ఒక రూపం లోంచి మరో రూపం లోకి అనువర్తితమవుతుందనే విషయాన్ని శక్తినిత్యత్వ సూత్రం చెబుతున్నా కవి "ఈ విశ్వంలో పదార్థాలు ఎంత మిగిలినా ఆలోచన లేకపోతే ప్రపంచం నశించిపోయినట్లే"అనే వొక తాత్వికానుభుతిని వ్యక్తం చేస్తాడు.కాలం మనం కట్టుకున్న గడియారాలను పీకి పారేస్తే నిలిచిపోదు అది గమిస్తూనే వుంటుంది.అయితే చలనం అనేది లేకపోతే కాలం చచ్చిపోతుందంటాడు కవి.చలనం అంటే మనిషిలో వుండే ఆలోచనల చలనం చైతన్య చలనం.పైన చెప్పిన రెండు అంశాలను కవి ఒక ముఖ్య మానవ సంబధాల అంశాన్ని బలపరచాటానికి కవిత్వంగా మార్చాడు.అదేమిటంటే "పలకరింపులు లేనంతనే/ పరిచయాలు ఆగిపోవు./ఙ్ఞాపకాలు లేకపోతేనే అవి కాస్తా ముగింపు కొస్తాయి"-ఈ అంశాన్ని పై రెండు అంశాలు పక్క పక్కన నిలబడి నిలబెడతాయి.ఇలా కవిత్వం నిర్మించటం వొక అపురూప శిల్పం."కాలాతీత గమనం"-అనే కవిత కవి ఆలోచనా ప్రతిబింబం.

శ్రీనివాస్ రాసిన 'హత్య'అనే కవిత చదవగానే గుర్తొచ్చింది తిక్కన మహాకవి రాసిన'పగయడగించుట యది లెస్స"అనే పద్యమే.ఈ' హత్య'- అనే కవిత ప్రారంభం వొక ఉద్వేగానికీ పాఠకున్ని గురిచేస్తుంది.అట్లా ప్రారంభమయ్యే వాక్యాలు రాయటం అంత సులువేం కాదు.కవిత ముగింపు కూడా అంతే ఉద్వేగభరితమై మనసును వికశింప చేసే వొక పాఠం అవుతుంది.శత్రువు ఎదురైతే వాని గుండెల్లోకీ బలంగా దిగేటట్టు పదునైన మెత్తటి చిర్నవ్వు కత్తి విసిరితే,అతని వైపు నుంచి కూడా అదే ఆయుధం వచ్చి గుండెల్లోకి బలంగా దిగితే ఇద్దరి మధ్య శత్రుత్వం చంపేయబడుతుందంటాడు శ్రీనివాస్.ఇమ్దు లోని మాటల పొదుపు ఇతని అభివ్యక్తి నైపుణ్యాన్ని మరింత పెంచింది.పాఠకుల్నీ పగయడగించే దిశగా అడుగులు వేయిస్తుంది.

శ్రీనివాస్ లో వొక విలక్షణత వుంది.ఎంత ఆధునికుడైనా ప్రాచీన కావ్య సాంప్రదాయాలను పట్టుకున్న కవిగా అది ఆయన ప్రత్యేకతగా గుర్తించవచ్చు.పూర్వ కవులు ద్వర్థి కావ్యాలు రాశారు.పింగళి సూరన "రాఘవ పాండవీయం'-అనే ద్వర్థి కావ్యం రాశాడు.ఒకసారి చదివితే రాముని గురించి,రెండోమారు చదివితే పాండవుల గురించిన కథ స్ఫురించేటట్లూ ద్వర్థి కావ్యం చేస్తుంది."ఫ్రీజర్","వర్షం వెలిశాక","నేషనల్ హైవే"-మున్నగు కవితల్లో ఈ ద్వర్థి కావ్య లక్షణం అన్వేషిస్తే అగుపిస్తుంది.'నేషనల్ హైవే"-కవితలో అది మనతో మాట్లాడుతుంది.కవి రోడ్డుకు మానవ ఆరోపణ చేశాడు."ఇవి ఎన్నాళ్ళనుంచో పెంచుకున్న నా స్వీయ సౌందర్యాలు"-అని అది అనటంలో గత వైభవ స్మరణ గుర్తుకొచ్చి మార్గాలకిరుపక్కల గల చెట్లు కనిపిస్తాయి.వాటిని వెడల్పు చేసే నెపంతో తన స్వీయ అందాలను పతనం చేశారని ముందే ఎడంగా వుంచాలన్న బాధ్యతను పద్దతులను పాటించివుంటే "నేనీనాడు శిథిలదేహంతో అవనత వదన భారంతో"ఇలా దుఃఖిత నయ్యేదాన్ని కాదు కదా అని రహదారి విలపిస్తుంది."నీ సొమ్మెమిపోయింది?దర్జగా పనికానిచ్చేసి పట్టించుకోకుండా వెళ్ళిపోతారు"అని నిష్టూరమాడి,"వికలమైన ప్రతి శకలాన్ని పేర్చి కూర్చుకోవలసింది నేనేగా"అనుకొంటూ ఎవరో చేసిన దానికీ బాధ్యత తానేవహించాల్సి వచ్చినందుకు తనను సమాధానపరుచుకొంటూ భవిష్యత్తులో తన భయాన్ని వ్యక్తపరుస్తుంది.ఇలా రహదారిని వర్ణించే వస్తువును చేసిన కవి దాని మానవ్త్వ ఆరొపణ చేసి ఇంకొక వస్తువు పాఠకుడికి దృశ్యమానం చేస్తాడు. "వర్షం వెలిశాక"-అనే కవితలో వర్షం ఆగిపోతున్న దశలోని ప్రకృతిని ఆవిష్కరించే స్థితిలోనే మానవ మనస్సులో చెదిరిన స్వప్నాల కల్లోలానంతర స్థితిని స్ఫురింపచేస్తాడు."ఊగి ఊగి ఆగిన/మొరటు తూగుడు బల్లలా కురిసికురిసి వెలిసిన వర్షం./చూరు చివరనుండి ఒక్కొ చినుకు రాలుతోంది" ఈ వాక్యాల్లోని భావచిత్రం శ్రీనివాస్ ఊహ శక్తిని మన కళ్లముందు నిలబెడుతుంది."ఫ్రీజర్" అనే కవితలో మరో శిల్పాన్ని ఈ కవి ప్రవేశపెట్టాడు.చిత్రబంధ కవితా రీతిని కూర్చాడు."దిగటం"-అనే పదాన్ని ది అనే అక్షరం కింద వొకమెట్టుకింద మరొమెట్టులా గ,టం, అనే అక్షరాలను పేర్చి ఒక వైచిత్రిని ప్రదర్శించాడు.ఇవన్నీ సాహిత్య ప్రయోగాలే. స్త్రీ సహానుభూతితో స్త్రీ స్వరంలో వినిపించిన మంచి కవిత "ఒక ఫిరమోన్ కన్నీటి నవ్వు".సజాతి జమ్తువులు తనతో జతకట్టే దానికి తమ శరీరాల నుంచి వొక రసాయానాన్ని విడుదల చేస్తాయి.దాన్నె ఫిరమోన్ అమ్టారు.కన్నీటీకీ దుఃఖం వుంటుంది కాని నవ్వు వుండదు.తనువు పుండై తాను మరొకరికి పండైన ఆమె కన్నీటి నవ్వుతో తనజాతి మనిషైన మగవ్య్క్తి వెదజల్లే దన ఫిరమోన్ తో కడుపు సంచి నింపుకొనే విషాద భీభత్సాన్ని "పదిలో సగం భర్తలున్న ద్రౌపదిలా నేను పతివ్రతనే సుమా!" అనే ఆమె హెచ్చరిక స్వరాన్ని వినిపిస్తాడు. చాల చిత్రమైన కవి శ్రీనివాస్.చదివిన చదువురీత్యా,ప్రవృత్తి రీత్యా ప్రయోగాలంటే మక్కువేమో?కవిత్వంలో గూడా ఒక ప్రయోగం చేశాడు.పరషాలను,సరళాలను ప్రయోగించి ఒక కవిత రాశాడు.క,చ,ట,త,ప అనే వాటిని ఒక్కదానిని ఒక శీర్షిక చేసి,ఒక్కొక్క దాని కింద కొన్ని కవితా పంక్తులు రాశాడు.అట్లాగే సరళాలైన గ,జ,డ,ద,బ ల కింద కూడ కొన్ని కవిత పంక్తులు రాశాడు.అయితే వీటిని వరుసగా చదివితే ప్రశాంత భావం స్ఫురించదు.క-కింద వున్న కవితా పంక్తులను,గ_కింద వున్నవాటితో కలిపి చదివితే సుందర భావార్థం ద్యోతకమవుతుంది అట్లాగే మిగిలినవి చదువుకోవాలి.ఇట్లాంటి వైచిత్రిని ఎవరు ఇటివలి కాలంలో ప్రదర్శించలేదు.ఆరుద్ర గారు చేశినట్లు అనిపిస్తోంది.వ్యాజ నింద వ్యాజ స్తుతితో కవిత్వం చాల మంది రాస్తూ వుంటారు.అట్లాగే శ్రీనివాస్ కూడా మదర్ తెరిస్సా ను నిందిస్తున్నట్లు కనిపించిన అందులో ఆమే మానవత్వ ప్రేమ రూపాన్ని అమ్మా ..ఎంత పని చేశావ్? -అనే కవితలోఅద్భుతంగా చెక్కాడు.

మీరైనా సెప్పండి-అనే కవిత కూడా స్త్రీ స్వరంలో చెప్పిన కవితే."కడుపులో ఆకలి కండ్లలో నీళ్ళతో"-వున్న ఆమెకు చేస్తున్నది తప్పు అని తెలియని తనం కాకాపోయినా ఏ రీతి బతకాలో తెలియని స్థితిలో మీరైన సెప్పమని చేసిన విన్నపాగ్నిని శ్రీనివాస్ చాల గొప్పగా చిత్రించాడు.అట్లాగే సురా శోకం వొక మంచి కవిత.అతనికే తెలియని అతని శోకం అతని భార్య,పిల్లలపాలిట శాపం."ఒక అర్థరాత్రి నా కవితలునేనే చదువుకొంటూ నా డైరీని నేనే పరిశీలిస్తూ ,అపరిపక్వతకు నవ్వుకుంటనన్నా"-అది అతని వినయమే తప్ప అపరిపక్వత కాదు.వొక కవి నుంచి ఇంకో కవి నేర్చుకోవాల్సింది ఎప్పుడూ వుంటుంది"-అన్న అఫ్సర్ మాటల్ని తిరిగి కవిసంగ మిత్ర కవులకు చెబుతు ఒక ఆలోచనాత్మక అద్భుత కావ్యాన్ని అందించినందుకు శ్రీనివాస్ ని అభినందిస్తున్నాను.
పుస్తక సమీక్ష
శ్రీ టి.రాజారామ్

కామెంట్‌లు