వీడు మగాడ్రా బుజ్జీ

అది తమిళ నాడు లోని ఒక మద్య తరగతి ఇల్లు. ఆయన పేరు అరుణాచలం మురుగానందం. ఆరోజు ఇంటి దగ్గరే వున్నాడు. అప్పుడే వాళ్ళవిడ చేతుల వెనక ఏదో దాచుకుంటూ వెళ్తోంది. "ఏంటి శాంతి అది" మృదువుగానే కానీ ఉత్సుకతతో అడిగాడు. ఒక్కక్షణం ఆగి మళ్ళీ ప్రశ్నను పట్టించుకొనట్లు ఆమె అలాగే వెళ్తోంది. "ఏంటమ్మా అది" ఈసారి ప్రశ్నలో అసహనం కూడా కలిసింది. ఇకతప్పదన్నట్లు ఆమె ఆగింది. పెటిల్మని మొహంమీద ఒకటిచ్చినట్లు " ఇది మీకు అనవసరం లెండి" అనేసింది. పురుషాహంకారం కాకపోయినా పిల్లచేష్ట కావచ్చు. స్వయంగా లేచెల్లీ అమెచేతులు ముందుకు లాక్కుని చూసాడు.

.....

బహుశా ఈ సంఘటన చాలా పెద్ద మార్పుకు బీజం అవుతుందని ఆమెకు కానీ అతనికి కానీ తెలియదు. ఆమె చేతుల్లో పాత గుడ్డలున్నాయి. అవి ఎంత పాతవి అంటే బైకు తుడుచే గుడ్డ కంటే మురికిగా ఉన్నాయి. అతనికి అప్పుడు అర్ధం అయ్యింది. అతిముఖ్యమైన ఆమె జీవిత అవసరాన్ని అనారోగ్యకరంగా వెళ్ళదీస్తోందని, "వేరేవి కొనొచ్చు కదా శాంతీ" అతనా ప్రశ్నలో ప్రేమను తొణకిస లాడించానని సంబరపడేలోగానే ఇతని తెలియని తనాన్ని సున్నితంగా వెక్కిరిస్తూ ఆమె సమాధానం చెప్పింది. "నేను కూడా టీవీ చూస్తాను. నాక్కూడా పత్రికల్లో వచేప్రకటనలు కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే మనింట్లో ఇద్దరికి ఇవి కొనాలంటే పాలబిల్లు కత్తిరించాల్సి వస్తుందని ఇలా సర్దుకు పోతున్నాం." సమాచార జ్ఞానం కంటే మించిందేదో మునీశ్వరుల్లా బయటపడని ఈ ఆడవాళ్ళ దగ్గరుంటుంది అని అర్ధం అయినట్లు ఆయన నిశ్శబ్దంగా మారిపోయాడు. ఆమె అతన్ని దాటుకుంటూ మెల్లగా లోపటి గదిలోకి వెళ్ళింది.

కధ ఇప్పుడే మొదలయ్యింది.

◆{{{{౺౾౻౺౾౻౽౿౽౺౻౾౽౿౾¥౾¥౾¥౾}}}◆

1962 లో పుట్టిన అరుణ్ ఇంకా గానుగెద్దు జీవిలా మారలేదు. ఎలాగైనా శాంతికి ఒక ఆరోగ్యకరమైన పరిష్కారాన్ని బహుకరించాలనుకున్నాడు. అలా అప్పుడప్పుడూ ఆమెను సంతోషపెట్టడం తనకి మరింత సంబరం కాబట్టి. బయటి షాపులో ఒక నాప్ కిన్ కొన్నాడు. సెల్లులోస్ కాటన్, పైన్ చెట్ల చెక్కపేడు గుజ్జు లాంటివి మాత్రమే ఉన్న ద్రవాన్ని పీల్చుకుని నిల్వవుంచుకునే ఈమాత్రం గుడ్డ ముక్కలకు ఇంత ఖరీదా? ఆశ్చర్య పోయాడు. ఇంత కాంటే మెరుగైనవి ఇంకా చౌకగా తయారు చెయ్యటం సాధ్యమే అనిపించింది. వెంటనే చకాచకా ఆ ఆలోచనను అమల్లో పెట్టాడు. పరీక్షించమని శాంతి కిచ్చాడు. పెద్దగా బాగాలేదు పాతపద్ధతే నయమని పెదవి విరిచింది ఆమె. ఎడిసిన్ బల్బు కనుక్కునేప్పుడు వెయ్యిసార్లు పరీక్ష చేసి ఉండొచ్చు. ఇప్పుడు రెండోసారి తను పరిశీలించాలంటే మరో నెల వరకు ఆగాలి. ఇలా అయితే మంచి నమూనా సృష్టించడానికి దశాబ్దాలు పడుతుంది. మరో మార్గం వెతకాలి. ఇది అత్యంత రహస్య విషయమే కాదు. అత్యంత నిషిద్ధ కట్టుబాటుగా సమాజం లో ఉండటం తో ఆఖరికి ఈయన గారి అక్కాచెల్లెళ్ళు కూడా ఈవిషయం లో ప్రయోగాలకైతే నువ్వు మయింటికి రాకపోవడమే మంచిదని తేల్చేశారు. మగవాడైన తనకి ఇంత సున్నితమైన విషయంలో మరో మార్గం ఎలా అని ఆలోచిస్తుంటే హఠాత్తుగా మెడికల్ కాలేజి విద్యార్థినులు గుర్తొచ్చారు. నోటితో చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే ఫీడ్ బ్యాక్ పత్రాల్లో రాసిమ్మని అడిగాడు. ఈ ధోరణికి చుట్టుపక్కల వాళ్ళు బహిరంగంగానే విమర్శించే వాళ్ళు. వీడొక పర్వర్టు రా అని హేళనలు ఎన్నెన్నో చుట్టుముట్టాయి. ఆఖరికి ఎవరిగురించి ఈ పరిశోధన మొదలెట్టాడో ఆ శాంతి కూడా అశాంతిగా మారింది. వీటన్నిటికీ ప్రతిగానా అన్నట్లు అరుణ్ మరింత కసిగా తన పని కొనసాగించాడు. మెడికల్ కాలేజీ అమ్మాయిలు సైతం ఇంత ముడుచుకు పోతారా అని ఆ సమాధాన పత్రాలను చూసి నైరాశ్యానికి గురయ్యేవాడు.

ఎవరిమీదో ఎందుకు తన మీద తానే ప్రయోగం చేసుకోవాలనే ప్రళయ నిర్ణయం తీసుకున్నాడు. ఒక రబ్బరు తిత్తి లో ఇంకు పోసి దానికి సెలైను గొట్టం కలిపాడు. తిత్తిని నొక్కినప్పుడల్లా ఇంకు గొట్టం ద్వారా బయటికి వస్తుంది. అంతే కాదు భార్య శాంతి కూడా ఈయన్ని వదిలి బయటికి వచ్చేసింది. విడాకుల పత్రాలూ పంపేసింది. వాటిని పక్కన పెట్టి వంటరి ఇంట్లో ఈయన పరిశోధన మరీ పెంచాడు. వాడిన తర్వాత లోపాలను తెలుసుకునేందుకు used pads తెచ్చి వెనక గదిలో కుప్పలుగా పోసాడు. సరే వాటిని తేవడానికి పడ్డ బాధలు మరో కథ అవుతుంది వీటిని వాడి ఈ పిచ్చోడు వశికరణమో, చేతబడో చేస్తాడేమో నాని అనుమానించి అవమానించిన వారూ వున్నారు.

ఒక ఆదివారం ఈయన దగ్గరకు వల్ల అమ్మ వచ్చింది. ఈ నీచు వాసనకు కారణం, కొడుకు చేపలో, చికెను కూరో వండు తున్నాడు కావచ్చు  అని ముందు అనుకుంది. తర్వాత విషయం తెలిసి షాక్ అయిపోయి శోకాలు పెట్టింది ఆవిడ.

చివరికి కోట్లాది రూపాయల ఖర్చుతో ఉన్న యంత్రాల స్థానం లో 65 వేల రూపాయిల యంత్రాన్ని సృష్టించాడు. అంతేకాదు ఈ గొప్ప ఆవిష్కరణకు పేటెంట్ కూడా లభించింది. 9 వ తరగతి లో చదువు ఆపేసిన అరుణ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఉపన్యసించాడు. దేశంలో గొప్ప పురస్కారం "పద్మశ్రీ" ని పొందాడు. టైమ్స్ పత్రిక నిర్వహించిన అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల్లో మోడీ ని, రాహుల్ ని, కేజ్రివాల్ ను తోసి రాజాని ముందుకొచ్చి నిలబడ్డాడు. అయినా సరే ఆయన లక్ష్యం ఇంకా నేరవేరనే లేదంటున్నారు. దేశం లోని 29 రాష్ట్రలలో 23 లో ఇప్పటికే తన జయశ్రీ పరిశ్రమ ద్వారా తక్కువ ధరకే వ్రక్తిగత అవసర వస్తువుని అందుబాటులో కి తీసుకువచ్చాడు. ప్రతి 5 మంది అమ్మాయిల్లో ఒకరు ఈ సమస్యతోనే బడి మానేస్తున్నారు. అధిక సర్వైకల్ కాన్సర్ లకు అందుబాటు లో లేని పరిశుభ్రతే కారణమని అరుణ్ కి తెలుసు అందుకే.
తన పేటెంట్ ను అధిక మొత్తానికి అమ్ముకోకుండా ప్రపంచంలో అన్నీమూలలకూ అది తక్కువ ధరలోనే చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఈ menustual man.

సరే అసలు విషయం చెప్పనే లేదు కదా శాంతి తిరిగొచ్చింది. ప్రపంచం సగౌరవంగా తన భర్త గొప్పతనాన్ని నెత్తి మీద పెట్టుకుందో అర్ధం అయిన తర్వాత తనెంత తప్పుగా అనుకుందో తెలిసొచ్చింది. ఇప్పుడు అరుణ్ తోనే సంతోషంగా కలిసిపోయింది.

■ మొత్తం ఆర్టికల్ ను మొబైల్ మీదనే టైప్ చెయ్యడం తో కొన్ని అక్షర దోషాలు దొర్లాయి. అర్థాన్ని తీసుకుంటూ చదవగలరు.
మూలం : నా ఫేస్ బుక్ పోస్ట్https://m.facebook.com/story.php?story_fbid=1557271544297358&id=100000435816359



కామెంట్‌లు