భాగ్యనగరపు లవ్ @ 420 ప్లస్

నాట్యం కూడా తెలిసిన ఒక అచ్చమైన బంజారా అందగత్తె, గోల్కొండకు 10 మైళ్ళ దూరంలోని చించలం అనే చిన్న గ్రామంలో వుండేది. మహమద్ కులీ కుతుబ్‌షా మనసుకు నచ్చిందామె. ఆమెను కలవాలని ప్రతిరోజూ ప్రాణాలకు తెగించి పరవళ్లు తొక్కుతున్న ముచుకుందా నదిని దాటుకుంటూ వెళ్ళేవాడు. యువరాజు విషయం తెలిసిన తండ్రి ఇబ్రహిం చాలా బాధపడ్డాడు. ప్రేమిస్తున్నందుకు కాదు. ప్రమాదకరంగా నదిదాటుతున్నందుకు. ఆ నదిపై వంతెన (1578లో ) కట్టించాడు  ఇది బాటసారికే కాదు ప్రేమకు కూడా వారధికావటంతో ఒక ప్యార్ కాపూల్, ప్యారానా పూల్ (ద లవింగ్ బ్రిడ్జ్) అయ్యింది.మూసీ నదిపై హైదరాబాదు నగరంలో దాదాపు ఏడు వంతెనలు ఉన్నప్పటికీ  అత్యంత పురాతనమైనది కావటంతో తర్వాత అది పురానా పూల్ (పాత వంతెన) పేరుబడింది.  ఆమె సహచరిగా మారిన తర్వాత కూడా ఆ ప్రేమ తగ్గలేదు. ఆమె పేరుతోనే భాగ్ నగరంగా పేరుపెట్టాడు. బహుశా దేశంలోనే తొలిగా కావచ్చు ఆమెపై రాసిన తన ప్రేమ కవితలను ‘‘ ఖుల్లియత్ ’’ పేరుతో ఒక కవిత సంపుటిగా తీసుకొచ్చాడు. 


తర్వాత ఏంజరిగింది ?


ఆమె ముస్లింగా మారిందట భాగ్ నగరం మళ్ళీ హైదర్ మహల్ అయ్యింది. చించలం శాలిబండ అయ్యింది. 56 మీటర్ల
ఎత్తుతో నాలుగు(చార్) మీనార్లతో, 1591 లో ఛార్మినార్ పేరుతో నాలుగు రోడ్ల కూడలిలో ఒక సున్నపు కట్టడం నిర్మించాడు. ఈ కట్టడంలో ఒక్కో మినార్‌ ఎత్తు 30 మీటర్లు, వలయాకారంలో 148 మెట్లు అంతర్భాగంలో రెండవ అంతస్తులో మసీదు నిర్మాణం చేపట్టారు.. ఇందులో ఒకేసారి 240 మంది నమాజ్‌ చేసుకునే సౌకర్యంతో కంటికి ఇంపుగా హైదరాబాద్ అంటే ఈ కట్టడమే అనేలా నిలచిపోయేట్లు కట్టించాడు. చార్‌మినార్‌ని భాగమతికి ప్రేమ కానుకగా నిర్మించారని కొందరు, 1590లో కలరా మహమ్మారి సోకి గోల్కొండ నగరం అత లాకుతలమయింది. నవాబ్ కులీ కుతుబ్ షా అక్కడి నుంచి చించలం గ్రామానికి తరలి వచ్చి తాత్కాలికంగా బస చేశా డు. వ్యాధి బెడద తగ్గిన తరువాత తిరిగి గోల్కొండ వెళుతూ తన బసకు గుర్తుగా 1591లో చార్మినార్ నిర్మించాడు. ఆ తర్వాత 1594లో నాల్గవ ఖలీఫా హజరత్ హైదర్ అలీ పేరిట నగరం నిర్మించాడనీ మరికొందరు చెపుతున్నారు.

 ఏదేమైనా బాగమతి గురించి ఇంతకంటే తెలిసిందేమీ లేదు. అయితే ఆ ప్రేమ కథ తర్వాత ఈ ఫోర్ ట్వంటీ ఈయర్స్ పైగా నగరం రాజధానిగానే వుంటూ వస్తోంది. ఇటాలి యన్ యాత్రికుడు టావెర్నియర్ నుండి మొన్నీ మధ్యన వచ్చిన జీవవైవిధ్య శాస్త్రవేత్తల వరకూ ఎందరినో మంత్రముగ్ధుల్ని చేస్తూనే వుంది నగరం. చార్మినార్ మీద 4.12.1889 నాటి నుండీ ఆడుతున్న గడియారాల సాక్షిగా ముందుకు వెళుతూనే వుంది. భారత దేశము లో ఐదవ అతిపెద్ద మహానగరము. అంతేకాదు హైదరాబాదు చుట్టు పక్కల మునిసిపాలిటీలను కలుపుకుపోతే ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానంలో వుంటుంది. 1948లో హైదరాబాదు రాజ్యము, న్యూఢిల్లీ యొక్క సైనిక జోక్యం (పోలీసు చర్య) తో భారత దేశము లో విలీనము అయ్యేవరకు ముస్లింల పరిపాలనలోనే ఉంది. 

ఇసుకలో ఆడుకుంటున్న పిల్లలందరూ కలిసి తలో చెయ్యివేసి ఒకే కోట కట్టారు. పువ్వులతోనూ నవ్వులతోనూ అలంకరించారు. ఇప్పుడది ఎవరిదని కట్టబెట్టాలి మొదటి నుంచి కాలు పెట్టినవాడా, ఎక్కడెక్కడిదో ఇసుక చేరవేసిన వారా, దాన్ని పువ్వులతో, రంగురాళ్ళతో, ఆల్చిప్పలతో అలంకరించినవారా?

అమ్మ ఇంటిపనులు బాగా చేస్తోంది నా దగ్గరుంటుందంటే నాదగ్గరంటున్నారు పిల్లలు. సాయం కోసం దీనంగా చూస్తున్న అమ్మలెవరికీ వద్దా. రాష్ట్ర తలసరి ఆదాయంలో సింహ భాగాన్నిచ్చే నగరం. గ్లోబల్ ట్రేడ్ సెంటర్, మొత్తం అపురూపమైన వస్తువులనీ పాతపుస్తకంలో నెమలీకల్లా దాచుకున్న నగరం. మిగిలిన రాష్ట్రాలు ముక్కున వేలేసుకునేలా అభివృద్ధి చెందిన మానవ వనరులు వారి నైపుణ్యపు స్థాయిలూ. ఇప్పుడు భాగమతి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు నగరాన్ని, ఎన్ని రాజకీయ ముచుకుంద్ లు వురవళ్ళు తొక్కినా దాటుకుంటూ వస్తామంటున్నారు. రోమియో,జూలియట్, పార్వతీ, దేవదాసు, షాజహన్, ముంతాజ్ బేగం ల ప్రేమ కన్నా ఇది మరీ ముదురుగా వుంది

లక లక లక లకా...


కామెంట్‌లు

  1. Excellent write up. I don't usually comment but, the way you concluded.. couldn't stop me from doing so. Kudos!

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలండీ మీ అభిమానానికీ, శ్రధ్దకీ...
    మా వాసూ గారిలా రాసారు..

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి