ధనవంతులు మరింత ధనువంతులుగా పేదలు మరింత మరింత పేదలుగా....

ఒక్కో సారి కొన్ని వాస్తవాలు తెలియకుంటేనే బాగు మనసు ప్రశాంతంగా వుంటుంది అనిపిస్తుంటుంది.

21వ శతాబ్దానికి బహుపాక్షిక విధానం అంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అధినేత్రి నిన్న (పిబ్రవరి 3,2014) న ఒక ఉపన్యాసం ఇచ్చారు ఆమె వెల్లడించిన వాస్తవాలు

భారతదేశం, అమెరికాలలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వనరులను ఉపయోగించుకుని సంపద పెరుగుతోంది అని సంబర పడుతున్నాం కానీ ఆ సంపదంతా ఎటుపోతోంది అని చూడంటం లేదు. కేవలం దేశ తలసరి ఆదాయం చూసి మురిసిపోతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి వుంది అంటూ

ప్రపంచ ధనవంతులలో కేవలం మొదటి 85 స్థానాలలో వున్న వ్యక్తుల ధనాన్ని కలిపిది అది ప్రపంచం మొత్తం లోని అట్టడుగు సగం ప్రపంచం జనాభా ఆదాయానికంటే రమారమి ఎక్కువగానే వుంటుందట. అందుకే కొందరు మూడొస్తే వేల కోట్ల బహుమానాలను ఇచ్చుకుంటుంటే మరోపక్క ఆకలితో చనిపోయేవాళ్లు పెరుగుతున్నారు.

ఈ పరిస్థితికి భారత దేశం కూడా భిన్నంగా లేదట పోయిన 15 సంవత్సరాలలో శతకోటీశ్వరులు సంపద పన్నెండు రెట్లు పెరిగింది. వీళ్ళ దగ్గర మూలుగుతున్న ధనాన్ని ఉపయోగిస్తే భారత దేశ దారిద్రాన్ని ఒక్కసారి కాదు రెండు సార్లు తొలగించ వచ్చని లెక్కలేసి మరి చెపుతున్నారు. అయినా కూటికీ, గుడ్డకూ, గూడుకూ నోచుకోని జీవితాలు అలాగే వున్నాయి.

అమెరికాలో ఆర్ధిక అంతరాలూ అంతే దారుణంగా తయారవుతున్నాయి ఇవి 1930 నాటి ప్రపంచ ఆర్ధిక మాంద్యం ముందున్న పరిస్థితులలా మారుతున్నాయట. లెక్కలలో చెప్పాలంటే 2009 తర్వాత అమెరికాలోని మొత్తం ఆదాయంలో 95 శాతం మేరకు జనాభాలోని ఒక్క శాతం ధనవంతులే కొట్టేశారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు ప్రపంచజనాభాలో 90 శాతం ప్రజల ఆదాయాలు తగ్గాయి.

ఇవే మాటలు LPG అంటూ వామపక్షాలు చెపితే మేధావులు సులభంగా వాళ్లంతేలే అని కొట్టేసే వారేమో కానీ ఆర్ధిక దేవుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి వెలువడిన ఆందోళనా పూర్వకమైన విశ్లేషణ సూచనా కూడా ఇది.

ఆమె ఉపన్యాసం చివరలో ఇప్పుడు వివిధ దేశాలలో సగటు వయసులు పనిచేసేందుకు అనుకూలమైన యువతగా వున్నారు. ఇప్పుడు వినియోగమవుతున్న శ్రమశక్తి అంతా ఇలా ఒక పక్కకే ప్రవహించి వృధా అయితే మరికొన్నేళ్లలో సగటు వయసు మరింతగా పెరిగి దేశాల సగటు శ్రమశక్తి తగ్గే సమయానికి తీవ్రమైన ఇబ్బందులకు గురవ్వాల్సి వుంటుందని హెచ్చరించారు.

సోకాల్డ్ ఆర్ధిక సూత్రాలను వల్లెవేస్తూ, విపరీతమైన అవినీతికి పాల్పడుతూ గుట్టలుగా పోగుపడే ఈ అసహజ ఆర్ధిక అంతరం గుదిబండగా మారక ముందే సంపదను సమాజం సక్రమంగా అనుభవించే పద్దతులగురించి ఈ తరం ఆలోచించకపోతే అటువంటి కార్యాచరణకు దిగకపోతే నష్టాన్ని అనుభవించక తప్పదు.

ఈ ఉపన్యాస పూర్తి పాఠం ఇక్కడ నుంచి చూడొచ్చు

http://www.imf.org/external/np/speeches/2014/020314.htm

కామెంట్‌లు